టాలీవుడ్ లో ఎక్స్ పోజింగ్ చేసే యాంకర్లకు ఇప్పుడు కొరత లేదు.. వెండితెరపై కంటే బుల్లితెరపైనే యాంకర్ లు ఎక్కువగా తమ అందచందాలను ప్రేక్షకులకు పంచుతున్నారు.. ఒకప్పుడు బుల్లితెర చూడాలంటే ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది పడేవారు కాదు కానీ ఇప్పుడు ఫ్యామిలీతో కూర్చుని ఏదైనా షో ని చూడాలంటే ఎక్కడ అసభ్యకరమైన బట్టలతో యాక్టర్లు కనిపిస్తారేమో అని ఈమధ్య ఓ ప్రేక్షకుడు విన్నవించాడు.. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై కనిపించే యాంకర్లు పోటు బట్టలతో యూత్ ఆకర్షిస్తున్న ఫ్యామిలీ ప్రేక్షకుల మంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు..

అనసూయ, రష్మి, వర్శిని, విష్ణు ప్రియ ఇలాంటి వారు తమకు ఛాన్సులు పెరిగేలా చేసుకోవడం కోసం పొట్టి బట్టలతో వీక్షకులను ఆకర్షించడానికి పోటీపడుతున్నారు.. ఇక బుల్లి తెర పైన కాకుండా వీరి సోషల్ మీడియాలో ఏవిధంగా ఉందో అందరం రోజు చూస్తూనే ఉన్నాం.. ఏ చిన్న పని చేసిన దానికి తగ్గ ఒక ఫోటోను పెట్టి అభిమానులను ఆకట్టుకుంటున్నారు ఈ యాంకర్లు. ఇటీవలే శ్రీముఖి, విష్ణు ప్రియ గోవాలో చేసిన అందాల రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బీచ్ లో సగం బట్టలతో కనిపిస్తూ తమ తడి అందాల ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టి లైకులు కామెంట్లు పొందారు..

గోవా కి వెళ్ళిన బ్యాచ్లో విష్ణుప్రియ కూడా ఉన్నారు.. ఆమె తన తడిసిన అందాలను చూపిస్తూ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలకు మంచి లైకులు వచ్చాయి..  ఫాలోయింగ్ కూడా పెరిగింది..  అయితే ఓసారి హోటల్ రూమ్ లో చేసిన పని గురించి ఇప్పుడు బయటకు చెప్పింది.. హోటల్ రూమ్ కి వెళ్ళిన ఎవరైనా పెన్నుతో పేపర్ మీద గీతలు గీసి రావడం అరుదుగా చూస్తూనే ఉంటారు.. అలా విష్ణుప్రియ కూడా తను దిగిన హోటల్ రూమ్ లో ఒక డ్రాయింగ్ తీసి దాని పై తన సిగ్నేచర్ పెట్టి అక్కడే వదిలేసి వచ్చిందట.. ఏదైనా హోటల్ రూమ్ కి వెళ్తే మొదట చేసే పని అదే అని గర్వంగా చెబుతుంది.. సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది విష్ణుప్రియ..

మరింత సమాచారం తెలుసుకోండి: