అక్కినేని హీరో నాగ చైతన్య టాలీవుడ్‌లో తాజాగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాను పూర్తి చేయగా.. విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మనం ఫేమ్ కే కుమార్ డైరెక్షన్‌లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు చైతూకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చాలా కాలం తర్వాత హీరో నితిన్‌కు బ్రేక్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఎవరైనా డైరెక్టర్‌కు ఓ మంచి హిట్ పడిందంటే.. ఆ సినిమా డైరెక్టర్‌కు వరుస ఆఫర్లు వస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ అలాంటి యువ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు వెంకీ కుడుముల. ఛలో, భీష్మ వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీకి ఇప్పుడు స్టార్ హీరోల నుంచి కూడా పిలుపు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కినేని హీరో కూడా వెంకీపై ఆసక్తి చూపిస్తున్నాడట.

కానీ, వెంకీ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే మెగా హీరోతో ఓ సినిమా చేయబోతున్నాడని.. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే SSMB28 కోసం వర్క్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి దీనిగురించైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే 'మజిలీ' 'వెంకీమామ' వంటి వరుస హిట్ సినిమాలతో జోష్‌లో ఉన్నాడు. అలాగే ఈ మధ్య స్పీడ్ పెంచిన చైతూ.. ఇప్పటికే 'లవ్ స్టోరీ' చిత్రాన్ని పూర్తి చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ కూడా చివరి దశలో ఉంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: