టాలీవుడ్లో గత ఏడాది విడుదలైన అల వైకుంఠ పురములో సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి ఏకంగా ఇండ్రస్టీ హిట్ ని అందుకుంది. అంతేకాదు త్రివిక్రమ్, బన్నీ ఇద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ ని అందించింది ఈ సినిమా.గతంలో వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో రాజమౌళి బాహుబలి తరువాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమా అల వైకుంఠ పురములో..

అంతేకాదు ఈ సినిమా దాదాపు 260 కోట్ల బిజినెస్ చేసి నిర్మాతలు,బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.కేవలం థియేట్రికల్ గానే కాకుండా డిజిటల్ రైట్స్ కి కూడా మంచి లాభాలే వచ్చాయి.అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని పలువురు హీరోలు గతేడాది తెగ చర్చలు జరిపారు.సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి చాలామంది పోటీ పడినప్పటికీ గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వలేదు.ఇక ముఖ్యంగా సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ఆ పాత్రకి హిందీలో ఏ హీరో అయితే న్యాయం చేస్తారని అనుకుంటున్న సమయంలో చాలామంది హీరోల పేర్లే వినిపించాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఫైనల్ అయినట్లు సమాచారం.ఇక బన్నీకి జోడిగా తెలుగులో పూజా హెగ్డే నటించగా.. బాలీవుడ్ లో కార్తిక్ కి జోడిగా కృతి సనన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇక బడా బాలీవుడ్ నిర్మాతతో కలిసి గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్రీమేక్ ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడట.అయితే ఈ రీమేక్ కి డైరెక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదట. త్రివిక్రమ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ హిందీలో కూడా రావాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. మరి బాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఎవరు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..మొత్తానికి మరో తెలుగు సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం విశేషమనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: