టాలీవుడ్ లో మంచి చాన్సులు వస్తే ఆ క్రేజ్ తో బాలీవుడ్ లోకి వెళ్లడానికి హీరోయిన్లు చాలా మంది ట్రై చేస్తున్న కాలమిది. పూజా హెగ్డే, రష్మిక వంటి హీరోయిన్లు ఇపుడు బాలీవుడ్ అంటూ కలవరిస్తూంటే అక్కడ హీరోయిన్ గా ఉన్న ఒక బొద్దు గుమ్మ టాలీవుడ్ వైపు చూస్తోందిట.

ఆమె ఎవరో కాదు సోనాక్షీ సిన్హా.  ఈ అమ్మడు బాలీవుడ్ లో అనేక హిట్ మూవీస్ లో చేసింది. ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో అక్కడ  క్రేజ్ కొంత తగ్గింది. దాంతో ఆమె చూపు టాలీవుడ్ మీద పడింది అంటున్నారు. ఆమె సౌత్ లో గతంలో రజనీకాంత్ లో లింగా సినిమాలో చేసింది. అయితే ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సౌత్ మళ్లీ ఆమెని పిలవలేదు. అయితే ఈ మధ్య కొంతమంది మేకర్స్ నుంచి ఆమెకు ఆహ్వానం వెళ్ళింది అంటున్నారు.

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ అఖండలో మొదట ఆమెను తీసుకోవాలని అనుకున్నారు. అయితే అది కుదరలేదు. ఇక మహేష్ బాబు మూవీలో కూడా అప్పట్లో తీసుకుంటారని న్యూస్ వచ్చినా వర్కౌట్ కాలేదు. ఇపుడు మాత్రం అదే మహేష్ బాబు తో సోనాక్షీ జత కడుతుంది అంటున్నారు. వీరి కాంబోను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీలో కూడా హీరోయిన్ గా సోనాక్షి పేరుని పరిశీలిస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే సోనాక్షీ కనుక తెలుగులో నటించేందుకు ఒప్పుకుంటే ఆమెకు చాన్సులు బాగానే వస్తాయి అంటున్నారు. సీనియర్ హీరోల నుంచి మిడిల్ ఏజ్ హీరోలకు ఆమె పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అంటున్నారు. మొత్తానికి సోనాక్షీతో మొదట నటించే హీరో ఎవరో చూడాలి. ఏది ఏమైనా టాలీవుడ్ కూడా ఇపుడు పాన్ ఇండియా మూవీస్ తీస్తోంది కాబట్టి బాలీవుడ్ ఈ వైపు చూస్తోంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: