పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ తెరకెక్కిస్తూనే మరో పక్క బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రీకరణలోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఏకకాలంలో జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాలు నెమ్మదించాయి. అయితే తాజాగా ఆదిపురుష్ షూటింగ్‌ గురించి అదిరిపోయే వార్త వినిపిస్తుంది. ఆదిపురుష్ తదుపరి షెడ్యూల్‌ కోసం ఓం రౌత్ రెడీ అవుతున్నారట. ఈ షెడ్యూల్‌ను ముంబైలో చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ ఉండడట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సమయంలో ప్రభాస్ సలార్‌తో పాటు రాధేశ్యామ్ సినిమా పాటలో నటించాల్సి ఉంది. మరి ఏది ముందు చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ఓం రౌత్ ముంబైలో ప్లాన్ చేసిన షెడ్యూల్ సన్నివేశాల్లో సైఫ్ అలీఖాన్ సన్నివేశాలే ఎక్కువట అందుకనే ఈ షెడ్యూల్ మొత్తం సైఫ్ అలీఖాన్‌తోనే చేయనున్నారట. ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కావల్సిన ఏర్పాట్లను కూడా ప్రారంభించారట. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి కూడా అయ్యాయట. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ఎక్కువ శాతం సైఫ్ సన్నివేశాలు ఉన్నాయట. అందుకనే ముంబైలో జరుగనున్న షెడ్యూల్‌ను సైఫ్ ఒక్కడిపైనే చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్‌లో సైఫ్ ఎక్కువగా రావణ్ పాత్రలో కనిపించనున్నాడట. ఈ మేరకు వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
 ఇదిలా ఉంటే ఈ సినిమా కృతి సనన్ సీత పాత్రలో చేస్తుండగా సన్నీసింగ్ లక్షణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై దేశంలోని సినిమా ప్రేమికులంతా తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. అందులోనూ ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి పౌరాణిక సినిమా కావడంతో ఈ సినిమా అంచనాలు మరింత అధికం అవుతున్నాయి. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడని సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ లుక్స్ ఎప్పుడు రివీల్ అవుతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: