మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో ఆచార్య సినిమా భారీ అంచనాలతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు తో పాటుగా చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేసే హంగామా మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుందని అంటున్నారు. ఇక ఆచార్య తర్వాత చిరు రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మళయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ కాగా మరొకటి కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో వస్తున్న సినిమా కూడా ఉంది.

ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లి షూటింగ్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక కె.ఎస్ రవీంద్రా సినిమాలో చిరు డవుల్ రోల్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మెగా కాంపౌండ్ నుండి అందిన సమాచారం ప్రకారం బాబీ డైరక్షన్ లో సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తుంది. సినిమాలో చిరు తండ్రి కొడులుగా కనిపించనున్నారని టాక్. జై లవ కుశ, వెంకీమామ సినిమాలతో సత్తా చాటిన డైరక్టర్ బాబీ చిరు సినిమాతో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్, కె.ఎస్ రవీంద్ర, మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో చిరు లుక్ కూడా కొత్తగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిరు క్యారక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. ఆచార్యతో పాటుగా లూసిఫర్ రీమేక్ మొదట స్టార్ట్ చేస్తున చిరు ఆ తర్వాత కె.ఎస్ రవీంద్ర సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుతుంది. ఆచార్యతో పాటుగా ఈ రెండు సినిమాలతో కూడా రికార్డులను టార్గెట్ పెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కంటెంట్ ఉన్న సినిమాలు కాబట్టి కచ్చితంగా అనుకున్న టార్గెట్ తప్పనిసరిగా రీచ్ అవుతాయని టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి: