బుల్లితెర పై యాంకర్ గా , నటిగా బాగా గుర్తింపు పొందింది అనసూయ. ఈమె సినిమాల వైపు ఆచితూచి అడుగులు వేస్తున్నది. కథ నచ్చితే, అందులోని పాత్ర నచ్చితేనే ఈమె సినిమాలకు ఓకే చేస్తున్నారట. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయనని ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ ద్వారా తెలియజేసింది. కేవలం సినిమాలలో మంచి నటిగా గుర్తింపు వస్తే చాలు అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్ "జయశంకర్" సోలో గా మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాగా గుర్తింపు పొందాడు.ఇప్పుడు విభిన్నమైన కథతో ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఆరు కథలకు సంబంధించిన సినిమాను తీయబోతున్నాడట. ఇందులో అనసూయ కథ కూడా ఉండను ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈమె ఎయిర్ హోస్ట్ గా కనిపిస్తుందట. ఇందులో ఈమె ఈ సినిమాలో హైలెట్ గా నిలబడి ఉన్నట్లు సమాచారం.

అనసూయ ఈ సినిమాలో ఆగస్టు నెలలో జాయిన్ అవుతుందట. గతంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేస్తూ, అందరినీ అలరించిన అసూయ. అల్లు అర్జున్ తో పుష్ప లాంటి సినిమా లో నటిస్తోంది. ఇక అంతే కాకుండా మరి కొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఏదిఏమైనా అనసూయ కు రెండు మూడు సంవత్సరాల నుంచి అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

దీన్ని బట్టి అనసూయ ఎక్కువగా తన పాత్ర మీద డిపెండ్  అయివుండేటువంటి సినిమాలనే ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె కథను బట్టి అందులోని క్యారెక్టర్ ను బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.అంతే కాదు అనసూయ అటు బుల్లితెర పైన ఎక్కువగా సంపాదిస్తోంది అని చెప్పవచ్చు. ఇక ఈమెకు వెండితెరపై కూడా మరిన్ని అవకాశాలు వస్తే స్టార్స్ లిస్ట్లోకి చేరిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: