పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిన విష‌య‌మే. ఈ సినిమా రామాయ‌ణం ఆధారంగా వ‌స్తున్న ఒక పౌరాణిక చిత్రం. ఈ సినిమా లో యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ రాముని పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. అలాగే సీత పాత్ర‌లో బాలీవుడ్ ప్ర‌ముఖ‌ న‌టి కృతి స‌న‌న్ న‌టిస్తోంది. అలాగే ప్రాధాన పాత్ర‌ల‌లో బాలీవుడ్ అగ్ర నాయ‌కులు సైఫ్ ఆలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ వంటి న‌టులు న‌టిస్తున్నారు. కాగ ఈ సినిమా ను ప్ర‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ విడుద‌ల చేయ‌నున్నారు. దానీ కోస‌మే టాలీవుడ్‌, బాలీవుడ్ నుంచి అగ్ర న‌టీ న‌టుల‌ను ఎంచుకున్నారు.



ఇదీలా ఉండ‌గా ఈ సినిమా కు హీరో ప్ర‌భాస్ చాలా స‌మ‌యాన్ని కేటాయిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సిన‌మా కావ‌డంతో సినీ అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల చేస్తారా అని ప్ర‌భాస్ అభిమానులు ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు ఆదిపురుష్ చిత్ర యూనిట్ విడుద‌ల డేట్ ను ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది లో ఆదిపురుష్ ను విడుద‌ల చేస్తామ‌ని అనౌన్స్ చేశారు. 2022 ఆగ‌స్టు 08న ప్ర‌పంచ వ్యాప్తంగా థీయేట‌ర్ల లో విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తో పాటు.. హింది, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. కాగ చాలా రోజుల నుంచి వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు లో విడుద‌ల అవుతుంద‌ని అభిమానులు అంచనా వేశారు.



కాగ ఆదిపురుష్ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెలిపారు. కాగ ప్ర‌స్తుతం ఈ సినిమా క్లామాక్స్ సీన్ లు షూటింగ్ జ‌రుగుతుంది. అలాగే వ‌చ్చే నేల‌లో భారీ బ‌డ్జెట్ తో కూడి యాక్ష‌న్ సీన్ లు తీస్తార‌ని స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ వ‌ర్క్ ల‌పై దృష్టి సారిస్తార‌ట‌. ఇది త్రీడి సినిమా కాబ‌ట్టి గ్రాఫిక్ ప‌నుల‌కే స‌మ‌యం ఎక్కువ ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. ఇలాగే ఈ గ్రాఫిక్ వ‌ర్క్ కు నిర్మాత లు భారీ బ‌డ్జెట్ ను కేటాయిస్తున్నార‌ని తెలుస్తుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: