చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా విడుదల ఇప్పటికి 44 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోని తనని ఆదరించిన ప్రేక్షకులు తనని ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన దర్శక, నిర్మాతలకు తమ అభిమానులకు సైతం చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ ట్విట్ లో ఇలా రాసుకోవచ్చు.. మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా 1978 సెప్టెంబర్ 22 ప్రాణం ఖరీదు చిత్రంతో తన పుట్టినరోజుగా తెలియజేశారు. 44 ఏళ్లుగా నన్ను ఇండస్ట్రీలో నడిపిస్తూ ఉన్నారని అభిమానులకు తెలియజేశారు. ఈ జన్మలో ఈ ఋణం తీర్చుకోలేని అంటూ కూడా ఒక ఎమోషనల్ పోస్టుని తెలియజేశారు చిరంజీవి.
వాస్తవానికి చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్లు అయితే ఆ తర్వాత చేసిన ప్రాణం ఖరీదు సినిమా ముందే విడుదలైంది. శివశంకర్ ప్రసాదిని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ చిత్రంలోని పాత్ర. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కే వాసు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.