బాహుబలి వంటి భారీ విజయం తరువాత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడానికి చాలామంది పలు ఇండస్ట్రీ లో ఉన్న సినిమా హీరోలు ముందుకు వచ్చారు. ఇదే క్రమంలో రాజమౌళి సినిమా విజయం తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. దీంతో సినిమా ప్రేక్షకుల రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే అనూహ్యంగా యధావిధిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించి..రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి RRR సినిమా మొదలు పెట్టడం తో ఈ ప్రాజెక్ట్ ఇండియా లోనే అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్రాజెక్ట్ అని ఇటీవల వార్తలు వినపడ్డాయి.

Image result for SHARUKH AMIR KHAN

ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా ప్రాజెక్టు కంటే మరో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ కలిసి మొట్టమొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే అమీర్ ఖాన్ సైఫ్ ఆలీఖాన్ తో కలిసి విక్రమ్ వేద అనే హిందీ రీమేక్లో నటిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అయినట్లు వార్తలు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరియు ఇద్దరు హీరోల అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

Image result for SHARUKH AMIR KHAN

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర ముగ్గురు ఖాన్ ల హవా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకానొక సమయంలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, తాజాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అమీర్, షారుక్ కలసి  అంజమ్ రాజబాలి యొక్క సారే జహాన్ సే అచ్చా కోసం కలసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావటంతో ఖచ్చితంగా ఈ సినిమా ప్రాజెక్టు మొదలైతే దేశంలోనే RRR సినిమా కంటే అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్రాజెక్ట్ అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: