విజయ దేవరకొండ అతి తక్కువ టైం లో సెన్సేషన్ హీరోగా మారిపోయారు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత విజయ్ పేరు బాలీవుడ్ లో కూడా ప్రకంపనలు రేపింది. దీనితో ఒక్క సారిగా స్టార్ హీరోల రేంజ్ కు విజయ్ వచ్చారు. అయితే విజయ్ కు డియర్ కామ్రేడ్ రూపంలో పెద్ద ప్లాప్ పడింది. ఇటువంటి ప్లాప్స్ ఇంకా కొనసాగితే విజయ కేరీర్ కే ప్రమాదం. ఎంత స్పీడ్ గా ఎదిగాడో .. అంతే స్పీడ్ గా పడిపోతాడు. అయితే విజయ్ నెక్స్ట్ సినిమా పూరీతో ఉండబోతుంది. పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇష్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పూరికి పలువురి హీరోల నుంచి అభినందనలు వచ్చాయి.


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు మెచ్చుకోవటంతో ఇక పూరి బ్యాక్ అనే స్థితికి వచ్చేశారు. దీనితో పూరి తరువాత సినిమా ఎవరితో ఉంటుందా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు విజయ్ తో సినిమా ఫిక్స్ అయ్యింది. అయితే విజయ్ అభిమానులు మాత్రం పూరీ డైరెక్షన్ పట్ల ఇంకా భయంగానే ఉన్నారు. పూరీ మళ్ళీ బ్యాక్ వచ్చే రేంజ్ లో ఇస్మార్ట్ శంకర్ లేదని చెప్పాలి. సినిమా మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచింది గాని చెప్పుకోదగ్గ స్టోరీ అయితే కాదు. 


దీనితో విజయ్ అభిమానులకు టెన్షన్ మొదలైంది. పూరీ అప్పుడప్పుడు ఒక మాదిరి సినిమా తీయడం అలవాటు. తరువాత ఎక్కువ ప్లాప్స్ ఇవ్వటం పూరీ స్టైల్. అయితే పూరి — విజయ్ కాంబినేషన్ లో సినిమాకు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మనే కోన సాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇష్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో మనం చూశాము. ఇంకా తనలో ఆ ఫైర్ ఉందని మణిశర్మ నిరూపించారు. దీనితో మ్యూజిక్ డైరెక్టుగా మణిశర్మ నే ననీ ఫిక్స్ అయిపోవచ్చు. ఈ విషయంలో విజయ దేవరకొండ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: