మెగా అభిమానులు  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  సైరా  ప్రీ రిలీజ్ ఈవెంట్  ఈనెల 18న  జరుగనుంది. ఈ ఈవెంట్ ను మొదట కర్నూల్ లో నిర్వహించాలని  అనుకున్నారు  కానీ గత కొద్దీ రోజులుగా అక్కడ వాతావరణం బాగాలేకపోవడంతో  ఈ వేడుకను హైదరాబాద్ కు  మార్చారు.  ఎల్ బి స్టేడియం లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుండగా ఈవెంట్ లోనే ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేయనున్నారు.  ఇక ఈఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  హాజరుకానున్నారని సమాచారం. కాగా చాలా రోజుల తరువాత మళ్ళీ  మెగాస్థార్  చిరంజీవి , పవన్ కళ్యాణ్ లను  ఒకే వేదిక ఫై  చూడాలనుకుంటున్న  అభిమానులకు నిజంగా ఇది కిక్కిచ్చే వార్తే.  ఇక  ఇటీవల విడుదలైన సైరా టీజర్ కు  పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్  ఇచ్చిన విషయం తెలిసిందే.  



పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి  ప్రధాన పాత్రలో నటించగా ఆయనకు జోడిగా   లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది.  వీరితో పాటు  బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు,  విజయ్ సేతుపతి , రవి కిషన్   ,సుధీప్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో  కొణిదెల ప్రొడక్షన్స్  పతాకంఫై  రామ్ చరణ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది.  ఒక్క  తమిళ , మళయాలం లో తప్ప  అన్ని భాషల్లో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైయింది. సాహో  తరువాత  ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా విడుదలవుతున్న  ఈ చిత్రం ఫై  భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: