పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. వీరితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి , రవి కిషన్ ,సుధీప్, తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంఫై రామ్ చరణ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో విడుదలకానుంది. ఒక్క తమిళ , మళయాలం లో తప్ప అన్ని భాషల్లో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైయింది. సాహో తరువాత ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా విడుదలవుతున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి.