ఇక గత సాధారణ ఎన్నికల్లోనే చంద్రబాబు కుప్పంలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయనకు కేవలం 30 వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మరోసారి కుప్పంలో పోటీ చేస్తారా ? అంటే పార్టీ వర్గాల్లోనే చాలా మంది డౌట్ అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలో లేదా, విశాఖ నలుదిక్కుల్లో ఓ చోట పోటీకి దిగుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. కుప్పంతో పాటు మరో నియోజకవర్గం.. ఇలా రెండు నియోజకవర్గాల్లో బాబు పోటీ చేస్తారని టాక్ ?
గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేవారు. అయితే అది ఆయన దమ్మేంటో చూపించేందుకు అన్ని ప్రాంతాల నుంచి పోటీ చేసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో పరిస్థితి బ్యాడ్ గా ఉండడంతో మరో నియోజకవర్గం చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అందుకే విశాఖ లో గత ఎన్నికలలో టీడీపీ నాలుగు సీట్లు గెలవడంతో ఈ సారి అక్కడ నుంచి కూడా పోటీ చేస్తారని అంటున్నారు.