
ఇప్పుడు తాజాగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రియాంక విడుదల చేశారు. అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండానే యూపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీకి కనీస సీట్లు దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ. అధికార బీజేపీతో సమాజ్ వాదీ పార్టీ నేతలకు కూడా షాక్ తగిలేలా తొలి జాబితాను ప్రకటించారు. 125 మంది అభ్యర్థులతో విడుదలైన తొలి జాబితాలో.... 40 శాతం సీట్లు మహిళలకు, మరో 40 శాతం యువతకు కేటాయించారు ప్రియాంక. అదే సమయంలో రాష్ట్రంలో సంచలనం రేపిన ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి ఆశాసింగ్కు కూడా ఫస్ట్ లిస్ట్ లోనే అవకాశం ఇచ్చేశారు. ఆశాసింగ్ ఉన్నావ్ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం మాత్రం ప్రియాంక గాంధీ వాద్రా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అంశం... అటు బీజేపీలో, ఇటు ఎస్పీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.