ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు అనేది చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించాలి అంటే అది అసలు సాధ్యం కాదు.ఇక సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నా కూడా క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు.ఇందుకోసమే అక్కడ కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచును అక్కడ కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో కూడా రష్యా దేశంలోని సోచీలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌ కోసం 80 శాతం కృత్రిమ మంచును వినియోగించగా అలాగే దక్షిణకొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ కోసం 98శాతం కృత్రిమ మంచును వినియోగించడం జరిగింది. అయితే, ఈసారి బీజింగ్ లో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్ కోసం 100 శాతం కృత్రిమ మంచును వినయోగించారు.

ఇటలీకి చెందిన టెక్నోఆల్సిన్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ పనులను అప్పగించడం జరిగింది. ఇక బీజింగ్ ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఇటలీకి చెందిన టెక్నో ఆల్సిన్స్ కంపెనీ 2018 నుంచి పనులను ప్రారంభించింది. ఒలింపిక్స్ గేమ్స్ కోసం కృత్రిమ మంచును తయారు చేసేందుకు సుమారు 49 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించడం జరిగింది.అంటే ఈ నీటితో సుమారు 10 కోట్ల మంది జనాలకి కొన్ని రోజులపాటు తాగునీరుని అందించవచ్చు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ గేమ్స్ లో 8 లక్షల చదరపు మీటర్లలో క్రీడలను నిర్వహించేందుకు గాను 12 లక్షల క్యూబిక్ మీటర్ల మంచు అవసరం అవుతుందని గుర్తించడం జరిగింది . 272 ప్రొఫెల్లర్ డ్రివెన్ ఫ్యాన్ గన్లు ఇంకా అలాగే 82 లాన్స్ స్టైల్ గన్లు వినియోగించి ఈ మంచును తయారు చేశారు. ఈ కృత్రిమ మంచు తయారీ కోసమే చైనా ఏకంగా 60 మిలియన్ డాలర్ల డబ్బును ఖర్చుచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: