నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్ ఇంకా ఏ3గా యువతి నిహారిక ని చేర్చారు.నవీన్ను హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడని డీసీపీ సాయిశ్రీ చెప్పారు. హత్య చేసిన విషయాన్ని స్నేహితుడు హసన్కు చెప్పాడని వెల్లడించారు. ఈ హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ పారిపోయి.. ఖమ్మం, విజయవాడ, విశాఖ ఇంకా వరంగల్కు వెళ్లాడని డీసీపీ వివరించారు. ఈ హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత 1500 రూపాయలు నిహారిక హరిహరకు ట్రాన్స్ఫర్ చేసిందని కూడా వివరించారు. గత నెల 24 వ తేదీన తిరిగి వచ్చి యువతి, హసన్ను హరిహరకృష్ణ కలిశాడని తెలిపారు. ఇక లొంగిపోవడానికి ముందు నవీన్ను చంపిన చోటుకు యువతిని, హసన్ను హరిహర కృష్ణ తీసుకెళ్లాడని కూడా డీసీపీ వెల్లడించారు.ఇక నిందితురాలు నిహారిక తన ఫోన్లోని డేటాను కూడా డిలీట్ చేసిందని… ఎవిడెన్స్ టాంపరింగ్కు పాల్పడిందని కూడా పోలీసులు తెలిపారు. హత్య విషయం తెలిసినా కూడా వీరు ఇద్దరూ పోలీసులకు చెప్పలేదని.. అందుకే వారిని కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు.
నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్ ఇంకా ఏ3గా యువతి నిహారిక ని చేర్చారు.నవీన్ను హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడని డీసీపీ సాయిశ్రీ చెప్పారు. హత్య చేసిన విషయాన్ని స్నేహితుడు హసన్కు చెప్పాడని వెల్లడించారు. ఈ హత్య చేసిన తర్వాత నిందితుడు హరిహరకృష్ణ పారిపోయి.. ఖమ్మం, విజయవాడ, విశాఖ ఇంకా వరంగల్కు వెళ్లాడని డీసీపీ వివరించారు. ఈ హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత 1500 రూపాయలు నిహారిక హరిహరకు ట్రాన్స్ఫర్ చేసిందని కూడా వివరించారు. గత నెల 24 వ తేదీన తిరిగి వచ్చి యువతి, హసన్ను హరిహరకృష్ణ కలిశాడని తెలిపారు. ఇక లొంగిపోవడానికి ముందు నవీన్ను చంపిన చోటుకు యువతిని, హసన్ను హరిహర కృష్ణ తీసుకెళ్లాడని కూడా డీసీపీ వెల్లడించారు.ఇక నిందితురాలు నిహారిక తన ఫోన్లోని డేటాను కూడా డిలీట్ చేసిందని… ఎవిడెన్స్ టాంపరింగ్కు పాల్పడిందని కూడా పోలీసులు తెలిపారు. హత్య విషయం తెలిసినా కూడా వీరు ఇద్దరూ పోలీసులకు చెప్పలేదని.. అందుకే వారిని కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు.