ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైస్సార్సీపీ కొత్తగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం ముప్ఫై మందితో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, సీఎం
జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను రిలీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.
సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు చెందిన నేతలను అధికార ప్రతినిధులుగా అవకాశం ఇచ్చారు. రెడ్డి, కాపు, కమ్మ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అవకాశం కలిపించారు. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ఆయా అధికార ప్రతినిధులు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించ బోనున్నారు. టీవీ ఛానళ్లలో జరిగే డిస్కషన్లకు కూడా వారే హాజరవుతారు అని అయన తెలిపారు.
ఈ ముప్ఫై మంది సభ్యులు వివిధ వర్గాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.