తమిళనాడు రాష్ట్రంలోని అనకాపత్తూరులో కొన్ని రోజుల క్రితం ఒక ఎలక్ట్రీషియన్ అదృశ్యమయ్యాడు. అతని కుటుంబసభ్యులు అతని కోసం ఎంతో గాలించారు, కానీ ఆ వ్యక్తి జాడ మాత్రం దొరకలేదు. చివరకు సినీ ఫక్కీలో ఆ వ్యక్తి శవమై తేలాడు. ఒక యువతిని కోరిక తీర్చాలని వేధించటం వలనే ఆ వ్యక్తి మృతి చెందాడని పోలీసుల విచారణలో తేలింది. యువతి ఆమె భర్త పక్కా పథకం ప్రకారం వేధించిన వ్యక్తిని హత్య చేశారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే 42 సంవత్సరాల వయస్సు గల కార్తికేయన్ అనే వ్యక్తి తమిళనాడు పల్లావరం సమీపంలోని అనకాపత్తూరు లేబర్ ప్రాంతానికి చెందినవాడు. 2019 డిసెంబర్ నెల 18వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన కార్తికేయన్ ఇంటికి తిరిగి రాలేదు. అతని కుటుంబసభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో కార్తికేయన్ కనిపించటం లేదని కేసు నమోదు చేసుకున్నారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు అతని సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 38 సంవత్సరాల వయస్సు గల శివకుమార్ అనే వ్యక్తితో కార్తికేయన్ ఎక్కువసార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు శివకుమార్ మరియు అతని భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేయగా విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
మొదట శివకుమార్, మాదేశ్వరి పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పోలీసులు విడిగా ఇద్దరినీ విచారించారు. విచారణలో శివకుమార్ భార్య మాదేశ్వరి ఒక పెళ్లిలో కార్తికేయన్ తో పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందని కార్తికేయన్ తన మొబైల్ లో ఆ తతంగాన్ని రికార్డ్ చేశాడని చెప్పింది. ఆ తరువాత కార్తికేయన్ తరచుగా ఫోన్ చేసి మాదేశ్వరిని లైంగిక కోరికలు తీర్చాలని లేకపోతే ఆన్ లైన్ లో ఫోటోలను పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తన భర్తకు చెప్పగా మాదేశ్వరి అతని భర్త కలిసి కార్తికేయన్ ను హత్య చేసి పాతిపెట్టారు. పోలీసులు మాదేశ్వరి, శివకుమార్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: