ఆడ‌పిల్ల‌ల పై అఘాయిత్యాలు చాలా స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతున్నాయి. దానిపైన ఎన్ని చ‌ట్టాలు..ఎన్ని శిక్షలు వ‌చ్చినప్ప‌టికీ ఆక‌తాయిల ఆగ‌డాలు మాత్రం ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఇటీవ‌లె శంషాబాద్ ప‌రిధిలో ఓ మైన‌ర్ బాల‌క పై అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఓ యువ‌కుడు మైనర్ బాలికను వలలో వేసుకుని గ‌త కొంత కాలంగా ఆమెపై రోజూ ఎన్నోసార్ల లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాధితురాలు గర్భ‌వ‌తి అయింది. ని చారినగర్‌కు చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన హరి అనే యువకుడు కన్నేశాడు.

 

దీంతో కుదిరిన‌ప్పుడ‌ల్లా ఆమెను బెదిరించి సెక్స్ చేసేవాడు. ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి ఆమెను మంచి చేసుకుని కుదిరిన‌ప్పుడ‌ల్లా ఆమెను తనుభ‌వించేవాడు. ఇక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించడంతో భ‌యంతో వ‌ణికిపోయి ఆ విష‌యాన్ని ఎవ్వ‌రికీ చెప్పుకోలేక ఆ బాలిక అలాగే ఉండిపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న హరి వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా ఆమెతో అదే ప‌ని చేసేవాడు. లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. ఇటీవల కుమార్తె శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాంతో వైద్య పరీక్షలు నిర్వ‌హించి బాలిక ఐదు నెలల గర్భంతో ఉంద‌ని డాక్టర్లు చెప్పడంతో వారు షాకయ్యారు. దీంతో షాక్ అయిన త‌ల్లిదండ్రులు వెంట‌నే బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఈ ఘటన పై సమాచారం అందుకున్నపోలీసులు వెంట‌నే  నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక బాలికపై అత్యాచార ఘటన గురించి తెలుసుకున్న బాలల హక్కుల సంఘం నేతలు ఆందోళ‌న‌కు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మ‌రి ఎన్ని శిక్ష‌లు ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా ఎందుకోగాని అస‌లు ఆక‌తాయిల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. అందులోనూ శంషాబాద్ లాంటి ఊరి శివార్ల‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: