ఇంకా మన దేశం లో అదే దుస్థితి . ఆడ పిల్లల్ని మైనస్ గా చూడడం ఎన్నో సంవత్సరాల నుండి కూడా తరుముతున్న దారుణం . దీని గురించి ఎన్ని మాటలు చెప్పినా వృధా అయ్యిపోతోంది. అయితే మరో సంఘటన తాజా గా వెలుగులో కి వచ్చింది. ఆడపిల్ల పుట్టకుండానే అనుమానంతో చంపేస్తున్నారు ఇంకా ఈ కాలం లో కూడా, అయితే మొదట ఆమెకి ఒక ఆడ పిల్ల పుట్టింది. ఈసారి కూడా అదే జరుగుతుందని ఇలా చేసాడట.

 

 

ఆ అనుమానమే ఓ నిండు గర్భిణీ ప్రాణం తీసింది. తల్లి, బిడ్డ ఇద్దరు మరణించారు. రెండు ప్రాణాలు కోల్పోయాయి కదా ...! గర్భస్రావం చేయిద్దామని బలవంతంగా ఆమె చేత మందులు మింగించాడు ఆ క్రూరుడు. తనకి తెలియని వైద్యం తో రకరకాల మందుల్ని బలవంతంగా భార్య చేత మింగించాడు.

 

ఈ దారుణ ఘటన కర్నూలు లో చోటు చేసుకుంది. మళ్ళీ ఆడ బిడ్డ ఎక్కడ పుట్టేస్తుందో అని ఆలోచించకుండా ఈ దారుణానికి పూనుకున్నాడు. ఆమెకి అతను ఇష్టం వచ్చిన మందుల్ని ఆమెతో బలవంతంగా మింగించడం వల్లనే ఆమె మృత్యువాత పడినట్టు తెలుసున్నదే. అయితే వారి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్ కరీంబాగ్ కాలినీ కి సంబంధించిన షేక్ వాహిని కి ఆ ప్రాంతానికే చెందిన షావలి కొడుకు షామీర్ తో మూడు సంవత్సరాల క్రితమే పెళ్లి అయ్యింది.

 

వారికి మొదట ఒక ఆడపిల్ల జన్మించింది. అయితే మరో సారి ఈమెకి  ఎక్కడ ఆడ పిల్ల పుడుతుందో అని అనేక మందులు బలవంతంగా మింగించడం ప్రారంభించాడు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రి కి తీసి కెళ్ళారు కానీ మెరుగైన చికిత్స కోసం నంద్యాల తీసికెళ్ళారు. పరిస్థితి చేయిజారి పోవడం తో ఆమె మృతి చెందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: