ఈ మధ్య అధికార పార్టీ వైసీపీ ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు బహిరంగంగానే మీడియా ముందు విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా గాని పార్టీ ప్రజాప్రతినిధులకు అధ్యక్షుడు జగన్ దొరకటం లేదని అంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు మరియు నిధుల విషయంలో చర్చించాలంటే జగన్ చుట్టూ కోటరీ ఉందని చాలామంది నేతలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా మొదటినుండి అందరి కంటే ముందు వైసీపీ పార్టీ సొంత ఎంపీ నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు...పార్టీకి పక్కలో బల్లెం లాగా ఉన్నారన్న వార్తలు మొదటినుండి వస్తున్నాయి. అలాగే మీడియా ఆయన వ్యహరిస్తున్న తీరు కూడా అలానే ఉంది.

 

వైసీపీ పార్టీ ఎంతో ప్రతిష్ఠిత్మకంగా తీసుకున్న ఇంగ్లీష్ మీడియం విషయంలోగానీ, ఇంకా మరికొన్ని పార్టీ అమలుచేస్తున్న నిర్ణయాలలో గాని, ఇటీవల అచ్చం నాయుడు ని అరెస్టు చేయటం విషయంలో గాని పార్టీకి వ్యతిరేకంగానే మీడియా ముందు రఘు రామకృష్ణం రాజు మాట్లాడటం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని, కోటరీ ఎవరో నాకు తెలియదు అంటూనే ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

 

దీంతో రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నాయని పార్టీలో ఉన్న కొంతమంది ప్రముఖులు లోలోపల గుసగుసలు ఆడుతున్నారట. ఈ నేపథ్యంలో కులం గురించి మాట్లాడే విధంగా రఘురామకృష్ణంరాజు దూకుడు వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో జగన్ రెస్పాండ్ అయితే బాగుంటుందని...చర్చించుకుంటున్నారట. లేకపోతే పార్టీ పై కుల ముద్ర పడే అవకాశం ఉందని...రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: