ఈ మధ్య కాలంలో అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకీ తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా చిన్న కారణాలతో మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా నే ముగిస్తున్నారు ఎంతోమంది. అంతేకాదు మరికొంతమంది కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా ఏకంగా  క్షణికావేశంలో సొంత వారి ప్రాణాలను తోడేస్తున్న ఘటనలు  కూడా రోజు రోజుకు తెర  మీదకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే  సమాజంలో తెర  మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు మనిషి ప్రాణాలకు విలువ ఉందా అనే అనుమానం కలగక మానదు.



 భార్య భర్తల బంధం అన్న తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అన్న విషయం తెలిసింది మనసా వాచా కర్మణా వేదమంత్రాల సాక్షిగా కడవరకు ఏ కష్టం వచ్చిన ఒకరికి ఒకరు తోడుగా ఉంటాము అని ప్రమాణం చేసి దాంపత్య జీవితం లోకి అడుగు పెడతారు భార్య భర్తలు. కానీ ఆ తర్వాత మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ప్రమాణం చేసిన వారు చివరికి కష్టాలను తెచ్చి పెడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రక్షణగా ఉంటాము  అని చెప్పిన వారు ఏకంగా ప్రాణాలను తోడేస్తున్న ఘటనలు రోజురోజుకీ తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.



 నాగర్ కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్యాంపు రాయవరం గ్రామంలో కోడి కూర వండలేదు అన్న కారణంతో భర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం సృష్టించింది. దసరా పండుగ రోజు సన్నయ్య అనే వ్యక్తి మద్యం తాగి ఇంటికి వచ్చాడు ఈక్రమంలోనే కోడి కూర వండాలి అటు భార్యను అడిగాడు. కానీ అందుకు నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారిన సన్నయ్య  ఉన్మాదిగా  మారిపోయాడు. దీంతో భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టి చంపాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు ఇంక ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా లోపల మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: