ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎలాంటి సంతోషకరమైన సందర్భాన్నైనా, పండగనైనా సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటే వారికి వెంటనే గుర్తుకు వచ్చే అంశాలు.... మద్యం, మాంసం. వీటిలో మద్యాన్ని ఆశ్రయించే వారి సంగతి తీసుకుంటే.... ఎవరైనా నలుగురు మిత్రులు ఒక చోట కలిస్తే ఇక అక్కడ మందు ఏరులై పారుతుంది. అలాంటి సందర్భం కోసం ఆ మందు బాబులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇటీవలే దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ పండుగలో సాధారణ జనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదుగానీ మందు బాబులు మాత్రం ఈ పండుగని ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నట్లుగా తాజా మద్యం అమ్మకాలకు సంబంధించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ దసరా పండుగకు మందు బాబులు దుమ్ము లేపినట్లుగా అవగతం అవుతోంది. కరోనా ప్రభావాన్ని సైతం లెక్క చేయకుండా పూటుగా తాగేశారు.

ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లిన మద్యం, బీర్‌ కేసుల విలువ రూ.812 కోట్లకు పైచిలుకే. అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడయిందన్న మాట. అదే నెల సగటు చూస్తే రోజువారీ అమ్మకాలు రూ.82 కోట్లు మాత్రమే జరిగాయి. అంటే దసరా సందర్భంగా మందుబాబులు లిక్కర్ అదే పనిగా పుచ్చుకున్నారన్నమాట! ఇక ఈ నెల మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్.. 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్‌ షాపులకు చేరాయి. ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడైపోయింది. ఈ నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్.. 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మందు బాబులా ! మజాకా ?

మరింత సమాచారం తెలుసుకోండి: