తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయటకు వెళ్లే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు వెళ్తారు ఏంటి అనేది ఇంకా స్పష్టత లేకపోయినా కొంతమంది నేతలు మాత్రం ఇప్పుడు ఇతర పార్టీ నేతలతో టచ్ లో కి వెళ్లారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అశోక్ మాత్రం ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణతో టచ్ లోకి వెళ్లాలని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఇటీవల బొత్స సత్యనారాయణను విశాఖపట్నంలో కలిశారని పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

గత కొన్ని రోజులుగా ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీనితో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు గత కొంతకాలంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బొత్స సత్యనారాయణతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బొత్స సత్యనారాయణ కూడా పార్టీ అధిష్టానం తో మాట్లాడి నిర్ణయం చెబుతామని అన్నారట. అయితే దాదాపు గా రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లుగా సమాచారం. యువనేత కావడంతో బొత్స సత్యనారాయణ కూడా ఆయన విషయంలో కాస్త ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. అయితే ఆయన పార్టీ మారితే మాత్రం స్థానిక నాయకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ అదేవిధంగా మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కాస్త ఎక్కువగా ఫోకస్ చేసారు సమాచారం త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు. అయితే దీపావళి తర్వాత ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తే మాత్రం టిడిపి బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: