అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏమాత్రం కృంగిపోని పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కూడా బీజేపీ నేతలకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో రాసుకుని పూసుకుని తిరిగాడు. అయితే పొత్తు పెట్టుకుని సంవత్సరం కూడా కాలేదు ఈ రెండు పార్టీ లకు అసలు పొసగడం లేదట.. అందుకు కారణం రెండు పార్టీ లకు వేరువేరుగా విధి విధానాలు ఉండడమే అంటున్నారు.. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో రెండు పార్టీ లకు ఏమాత్రం ఒకే అభిప్రాయం కుదరట్లేదట. అయినా పవన్ కళ్యాణ్ గ్రేటర్ లో పోటీ చేయకుండా బీజేపీ కి మద్దతుగా నిలిచారు.
అయితే తొలిసారి బీజేపీ తో సంబంధం లేకుండా ఓ పనిచేయబోతున్నారు పవన్ కళ్యాణ్. నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం… రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. చాలా రోజుల తర్వాత రైతుల కోసం ప్రజల్లోకి వెళ్తున్నాయి. నివార్ తుపాను వల్ల పాడైన పంటలను పరిశీలించేందుకు కోస్తా, రాయలసీమలకు వెళ్తున్నారు. బుధవారం నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం గుంటూరు జిల్లాలో ఆ తర్వాత మూడు రోజుల పాటు అంటే.. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.