దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత తెలంగాణా బిజెపి నేతలు ఇప్పుడు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా తెలంగాణాలో ఇప్పుడు తెరాస ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు బిజెపి నేతలు. త్వరలో నాగార్జునా సాగర్ ఉప ఎన్నిక ఉన్న నేపధ్యంలో మరింత స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇక అవినీతి వ్యవహారాల విషయంలో కూడా కాస్త స్పీడ్ పెంచి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా తెరాస  పరిస్థితి చూసి ఆ పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే బిజెపి ఎంపీ అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారని నేను అనుకోను అని ఆయన అన్నారు. కేటీఆర్ కి ఏ అర్హత ఉందని సియం చేస్తానంటున్నారు అని ఆయన నిలదీశారు. ప్రగతి భవన్ మాఫియా డెన్ గా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు. పాస్ పోర్టు బ్రోకర్ రాష్ట్రానికి సియం అవటం ప్రజల దురదృష్టం అని ఆయన అన్నారు. మై హోమ్ రమేశ్వర్ రావు ప్రాసిక్యూట్ అవుతారు అని ఆయన ఆరోపించారు.

మైనింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకి వెళ్ళటం ఖాయం అని అన్నారు. బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే అర్హత తెరాస కి లేదని అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాం అని ఆయన స్పష్టం చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ సింగిల్ డిజిట్ కె పరిమితం అవుతుంది అని ఆయన వెల్లడించారు. హిందువులపై మీ దాడులకు ప్రతి దాడులుంటాయి అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులందరు మంత్రులయ్యరు అని ఆయన ఆరోపించారు. ప్రో. జయశంకర్ ను కంట తడి పెట్టించిన మూర్ఖుడు కెసిఆర్ అని విమర్శించారు. 80 వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని కేసీఆర్. ఆయన సంస్కార హీనుడు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: