తాము మనుషులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి దారుణంగా వ్యవహరిస్తూ చివరికి నోరులేని జీవాల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య ఈ కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కరువై క్రూరత్వం పెరిగిపోతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన అందరిని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. మనుషులు రోజు రోజుకు ఎంత క్రూరమృగాలు గా మారిపోతున్నారు అన్నది ఇక్కడ జరిగిన ఘటనతో అర్థమవుతుంది.
గతంలో గర్భంతో ఉన్న ఒక ఏనుగు నోట్లో బాంబు పెట్టి చివరికి ఏనుగును పొట్టన పెట్టుకున్నారు కొంతమంది నీచులు. ఇక ఇటీవల ఏకంగా క్రూర మృగం చిరుత ని కూడా వదల్లేదు. ఏకంగా చిరుతను చంపేశారు. అంతటితో ఆగకుండా చిరుత మాంసం వండుకొని తిన్నారు. కొంత మాంసాన్ని మార్కెట్లో భారీ రేటుకు అమ్మారు కూడా. కేరళలోని ఇడుక్కి జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఐదుగురు వ్యక్తులు చిరుతను చంపి దాని మాంసాన్ని వండుకొని తినడం కాదు ఇక బయట మార్కెట్లో అమ్ముతున్న విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.