అంతకముందు తనను అరెస్ట్ చేసే అవకాశముందని చెప్పారు పట్టాభి. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చూపించారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటే వారి చేతిలో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందన్నారు పట్టాభి. తనకు ఎలాంటి ప్రమాదం జరిగినా పోలీసులదే పూర్తి బాధ్యతని హెచ్చరించారు.
పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పట్టాభిని అరెస్ట్ చేయడం పట్ల ఆయన సతీమణి ఆందోళన వ్యక్తం చేసింది. బలవంతంగా ఆయన్ను తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పోలీసులపై నమ్మకం లేదన్న ఆమె.. తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని హెచ్చరించారు. మరోవైపు పట్టాభిపై 152ఏ, 505(2), 504(ఆర్/డబ్ల్యూ), 120బీ కింద కేసులు నమోదయ్యాయి.