రైతు చట్టాల రూపకల్పనలో చర్చ జరిగిందా:
2020 సెప్టెంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు జరుగుతుందనే నెపంతో రైతు సంఘాల తో కానీ ప్రతిపక్షాలతో కానీ ఎలాంటి చర్చ చేయకుండానే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినవి. బిల్లులను ప్రవేశ పెట్టే ముందు ప్రభుత్వం తన ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తూ రైతు పండించిన పంటకు ఎక్కువ ధర రావాలంటే దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ,ఆ స్వేచ్ఛా స్వాతంత్రం రైతులకు ఉండాలని, ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మరింత ధర పొందవచ్చని అనేక సాకులతో బిల్లులను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బిల్లుపై సమగ్ర చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టినప్పుడు ఇలాంటి చర్చకు ప్రభుత్వం ఆమోదించకుండా ప్రతిపక్ష సభ్యులను బహిష్కరించడం ద్వారా ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవడం జరిగింది.