టిడిపి డబ్బు కోసమే ఉపయోగించిందని..ఆయన డబ్బు బాగా ఖర్చు పెట్టారని మరి ఏమైందో తెలియదు కానీ గంట నరహరిని చంద్రబాబు పక్కన కి పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన పార్టీకి టచ్ లోకి వెళ్లి గత నెల 11వ తేదీన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన పార్టీలోకి వెళ్లారు.తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇస్తానంటూ హామీ ఇవ్వడంతో ఆయన చేరినట్లుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.. కానీ చివరికి చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు తిరుపతి టికెట్ సీటు ఇచ్చారు.
ఇప్పుడు వాటి ప్రభావమే అనుకుంటా తనకు మాట ఇచ్చి తప్పాడని కోపంతో ఆయన జనసేన పార్టీని వీడి వైసిపి పార్టీలోకి చేరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దివంగత టిడిపి చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడుకి గంట నరసింహారావు బంధుత్వం ఉన్నది.. తనను కూడా మోసగించిన పవన్ కు గుణపాఠం చెప్పేందుకే ఈయన వైసీపీలోకి చేరినట్టుగా నరహరి ఆయన అనుచరులు సైతం తెలియజేస్తున్నారు. అయితే జనసేనలో పట్టుమని గట్టిగా రెండు వారాలు ఉండకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఏది ఏమైనా చాలా మంది జనసేన పార్టీని వీడి టిడిపి పార్టీని వీడి వైసీపీలో చేరికలు మొదలవుతున్నాయి.. ఇది గెలుపుకు సంకేతమే..