బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రతి సీజన్ కూడా అంతకంతకు సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. ప్రపంచ క్రికెట్లో అతి పెద్ద దేశీయా లీగ్ అయిన ఐపీఎల్లో ఆడటానికి విదేశీ క్రికెటర్లు సైతం ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికి ఎంతో మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్లో  వివిధ జట్లలో ఆడుతూ తమ సత్తా చాటుతున్నారు. అంతే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ ఎంతో మంచి వేదికగా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  క్రికెట్ మజాని రెట్టింపు చేసేందుకు ఇటీవల  బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ పోరును మరింత రసవత్తరంగా మార్చేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి మరో రెండు కొత్త జట్లలను తీసుకు వస్తూ నిర్ణయం తీసుకుంది బిసిసిఐ. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు జట్లు ఐపీఎల్ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఇక ఈ మెగా వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది.


 అదే సమయంలో ఐపీఎల్ లో ఫ్రాంచైజీ లకు కొంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడు అంటూ స్పష్టం చేసింది. అయితే  ఏ జట్టు తరపున ఆడబోతున్నాడు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పటి వరకూ తన బౌలింగ్తో బ్యాటింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయాలను అందించిన బ్రావో ని రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl