గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. మోకాలి సర్జరీ కూడా జరగడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ మెల్లిగా నడుస్తూ కోలుకుంటున్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే అటు ఐపీఎల్ ప్రారంభం అయింది దీంతో ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా అతను అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. దీంతో ఇక పంతు స్థానంలో డేవిడ్ వార్నర్ కు సారాధ్య బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ జట్టు యాజమాన్యం.


 కానీ రిషబ్ పంత్ ఇక ఢిల్లీ జట్టుకు చేసిన సేవలను మాత్రం మరవలేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్ కు ఒక అరుదైన గౌరవం ఇచ్చేందుకు ఢిల్లీ జట్టు యాజమాన్యం సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరికీ క్యాప్ లు జెర్సీలపై కూడా రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ ఉండేలా చూడాలని అనుకుంటుందట ఢిల్లీ యాజమాన్యం. ఈ విషయంపై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రిషబ్ పంతును మేము చాలా మిస్ అవుతున్నాం. ప్రతి మ్యాచ్ కు అతడు డగ్ అవుట్ లో నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నా. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతడిని జట్టులో భాగం చేయాలనుకుంటున్న. అందుకే మేము అతని జెర్సీ నెంబర్ను ఇతర ఆటగాళ్ల జెర్సీలు లేదా క్యాప్ లపై ఉంచాలి అని భావిస్తున్నాం. పంత్ జట్టులో లేకపోయినా ఎప్పటికి అతడు మా నాయకుడే అంటూ తెలియజేయడం కోసమే ఇదంతా చేస్తున్నాం. అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl