కేవలం క్రికెట్ ప్రేక్షకులను మాత్రమే కాదు బిసిసిఐ సెలెక్టర్ లను కూడా ఆకర్షించిన ఈ యువ ఆటగాడు ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక అయ్యాడు. ఇక ఎలాంటి అనుభవం లేకపోవడంతో కేవలం బెంచ్ స్ట్రెంత్ కి మాత్రమే నటరాజన్ పరిమితం అవుతాడు అని అనుకున్నారు. కానీ జట్టులోని ఆటగాడు గాయాల బారిన పడడంతో జట్టులో స్థానం సంపాదించిన యార్కర్ కింగ్.. ఇక అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కీలక వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇలా టి20, వన్డే సిరీస్ లతోపాటు చివరికి టెస్ట్ సిరీస్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు నటరాజన్.
అయితే తనకు టీమిండియా జట్టులో అవకాశం దక్కడంపై స్పందించిన నటరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలో తాను అరంగేట్రం చేస్తాను అన్నది తాను కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్. తొలి మ్యాచ్ ఎంతో ఒత్తిడిలో ఆడానని ఇక ఆతర్వాత వన్డే సిరీస్లో అవకాశం వస్తుంది అని ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత టెస్టు సిరీస్లో అవకాశం రావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం అన్నది మాటల్లో చెప్పలేని అనుభూతి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే తో పాటు అందరు ఆటగాళ్లు ఎంతగానో సహకరించారు అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్.