వాట్సాప్  నుంచి మరో అదిరిపోయే ఫీచర్?

వాట్సాప్  : మెటా కంపెనీ కి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ కూడా సరికొత్త ఫీచర్లతో ఎంతోమంది యూజర్లను సంపాదించుకుంటుంది. ఇంకా ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇప్పటికీ ఎన్నో మంచి ఫీచర్ లని అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‭ ని కూడా తీసుకువచ్చింది. అయితే ఇక ఇప్పటిలా కాకుండా ఇక నుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ లాక్ తీయాల్సిందేనని సంస్థ తాజాగా పేర్కొనడం జరిగింది.ఇక స్క్రీన్ అనే పేరుతోనే తీసుకువస్తున్న ఈ ఫీచర్‭తో డెస్క్‭టాప్‭లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా పాస్‭వర్డ్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిందేనట. యూజర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే ఈ ఫీచర్ తీసుకు వచ్చినట్లు మెటా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ వల్ల అదనపు సేఫ్టీ కూడా లభిస్తుందని చెబుతున్నారు.అయితే ఈ కొత్త ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఇది కేవలం టెస్టింగ్ దశలో ఉందట. 


టెస్టింగ్ కనుక పూర్తైతే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం తెలుస్తుంది. నంబర్ లేదంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ భద్రతలో స్ర్కీన్ లాక్ తీసుకు వస్తున్నారట. ఒకవేళ యూజర్ కనుక దీని పాస్‭వర్డ్ మర్చిపోతే యాప్ నుంచి లాగౌట్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మళ్లీ లాగిన్ చేసుకోవచ్చని కూడా పేర్కొనడం జరిగింది.అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి సెక్యూరిటీ లేదు. ఒక్కసారి డెస్క్‭టాప్‭లో లాగిన్ అయితే చాలు, మళ్లీ లాగౌట్ కొట్టేంత దాకా ఓపెన్ అయే ఉంటుంది. దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే వారి ప్రైవసీకి ప్రమాదం ఉందనే వాదనలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇక వీటికి చెక్ పెట్టేందుకే కొత్త ఫీచర్ తీసుకు వస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మెటా యాజమాన్యం పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: