పెరుగులో ప్రోటీన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 అధికంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ను బలోపేతం చేయడానికి సహాయం చేసే మంచి బ్యాక్టీరియా ఈ పెరుగు వల్ల పెంచుతుంది.అంతేకాదు ప్రతి రోజు పెరుగు తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
1. పాలు - పెరుగు : ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మంచి బలాన్ని చేకూర్చే పదార్థాలు అయినప్పటికీ.. విడివిడిగా తీసుకుంటేనే మనకు ప్రయోజనాలు కలుగుతాయి . కానీ కొంత మంది పాలు తాగిన వెంటనే.. పెరుగు తింటూ ఉంటారు.. కానీ పెరుగు తిన్న వెంటనే.. పాలు తాగుతూ ఉంటారు.. ఇలా చేయడం వల్ల డయేరియా, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
2. పెరుగు - చేపలు:
పెరుగు, చేపలు కాంబినేషన్ లో మనం తినకూడదు అని తెలిసిన విషయమే.. ఈ విషయం చాలామందికి కూడా తెలుసనే చెప్పాలి. ఒకవేళ చేపలు తిన్న తర్వాత పెరుగు తిన్నట్లయితే వాంతులు , జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. పెరుగు - ఉల్లిపాయ:
సాధారణంగా పెరుగుపచ్చడి లో ఈ రెండింటిని కలుపుతారు అన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఉల్లిపాయలు వేడిని కలగజేస్తాయి..పెరుగు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది..కానీ ఈ రెండు కలిపి తినడం వల్ల.. అలర్జీలు, వాంతులు , గ్యాస్ , అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.