కొవిడ్‌-19 భార‌త్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. కరోనా బారినపడి  గడిచిన 24 గంటల్లో మరో 50మంది మృత్యువాత పడ్డారు. మరో 1383 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక‍్టివ్‌ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

 

ఇక ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ అక్కడ 5,218  కేసులు నమోదు అయ్యాయి. అలాగే 2,178 కరోనా కేసులతో గుజరాత్‌ రెండో స్థానంలో ఉంది. కేరళలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే అక్కడ 19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: