క‌రోనా వైరస్ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ మిష‌న్ ద్వారా విదేశాల నుంచి భార‌తీయులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో విదేశాల నుంచి వస్తున్న వారి కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంలో ఫారెన్‌ క్వారంటైన్ కొవిడ్‌ సెల్‌ ప్రారంభమైంది. విదేశాల నుంచి నెల్లూరుకు వచ్చే వారు, విదేశాలకు వెళ్లే వారి వివరాలన్నీ ఈ సెల్‌లో నమోదు చేసుకుంటారని ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ, క్వారంటైన్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి వెల్ల‌డించారు.

 

ఇందుకోసంగా 20 మంది సిబ్బంది ఈ సెల్‌లో నిరంతర సేవలందిస్తారని, విదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఆయ‌న అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 15,555 మంది జూన్‌ 15వ తేదీ లోపు వస్తున్నట్లు తెలిపారు.  వీరందరి వివరాలు సేకరించడంతోపాటు వారు విమానాశ్రయంలో దిగిన వెంటనే క్వారంటైన్‌కు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: