తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. తాజాగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. గతంలో సెక్రటేరియట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళకు కరోనా నిర్ధారణ కాగా తాజాగా ఐటీ శాఖలో పని చేస్తున్న మరో ఉద్యోగికి కరోనా నిర్ధారణ కావడం ఉద్యోగులను కలవరపెడుతోంది. తాజాగా కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నారు. 
 
సెక్రటేరియట్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తక్కువ సంఖ్యలో సిబ్బంది కార్యాలయానికి హాజరవుతున్నారు. అలాగే ఆమెతో ఇంటరాక్ట్ అయిన మిగిలిన ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీఆర్కే భవన్‌లోకి ప్రస్తుతం సందర్శకులను అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చే వారిని మాత్రమే సంబంధిత అధికారుల అనుమతితో లోపలికి పంపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: