హైదరాబాద్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకి కోరనా కేసులు వందల్లో నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ వస్తున్నాయి. ఇక అధికార తెరాస పార్టీ ని ఇప్పుడు కరోనా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు తెరాస నాయకులు అందరూ భయపడుతున్నారు.

 

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఈ నేపధ్యంలో తెలంగాణా సిఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసారు. ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హైదరాబాద్ రావొద్దు అని ఏదైనా పని మీద వచ్చినా ఫ్యామిలీ తో అసలు రావొద్దు అని ఆయన సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: