తమిళనాడు రాష్ట్ర సహకార శాఖా మంత్రి సెల్లూర్‌ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల పట్ల ప్రేమానురాగాలు కలిగిన సిఎం పళని స్వామికి కరోనా వచ్చే అవకాశం లేదని వచ్చినా సరే వెంటనే తగ్గిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. మదురై లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా మదురై జిల్లా యంత్రాంగం, కార్పొరేషన్లు సంయుక్తంగా చర్యలు చేపట్టాయని ఆయన పేర్కొన్నారు.

 

ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు కరోనా పరీక్షలను కూడా అధికం చేశామని చెప్పిన ఆయన... కరోనా నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమలుపై జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. పొరుగు జిల్లాల నుంచి జిల్లాకు వచ్చే వారి సంఖ్య అధికమైందన్నారు. వారందరికి జిల్లా సరిహద్దుల్లోనే వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: