కర్ణాటక దావణగిరిలోని ఓ ప్రైవేటు ల్యాబ్​ చేసిన నిర్వాకం నవజాత శిశువు మృతికి కారణమైంది. శిశువు తల్లికి కరోనా పాజిటివ్​ అని తప్పుడు నివేదిక ఇవ్వటమే ఇందుకు కారణం. కరోనా ఉందని శిశువు జన్మించాక తల్లి నుంచి వేరుగా ఉంచారు. శ్వాసకోశ ఇబ్బందితో చిగాతెరి ఆసుపత్రిలో 6 రోజుల తర్వాత ఆ శిశువు మృతి చెందింది.

 

 

ఓ ప్రైవేటు ల్యాబ్​లో జూన్​ 18న కరోనా పరీక్ష చేయించుకుంది ఆ గర్భిణీ. నివేదికల్లో పాజిటివ్​గా రావటం వల్ల జిల్లా ఆసుపత్రిలో చేరింది. ప్రసవం జరిగిన తర్వాత శిశువును ఐసీయూలో ఉంచారు. ఆమె ఎలాంటి కంటైన్మెంట్ జోన్​లో లేనందున మరోసారి బెంగళూరు ల్యాబ్​లో పరీక్షించగా నెగటివ్​గా వచ్చింది. అయితే అప్పటికే శిశువు మరణించింది.

 

 

ల్యాబ్​ నిర్లక్ష్యంపై శిశువు తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బాలుడి ముఖాన్ని తల్లికి చూపించలేకపోయామని ఆవేదన చెందారు. తమకు న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: