శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ రానుందని అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులు కన్నా భక్తులు మనోభావాలకే ప్రాధాన్యతనిస్తామని టీటీడీ యాజమాన్యం ఈ సందర్భంగా పేర్కొంది. 

 

ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని ఈ సందర్భంగా యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటికే 25 లక్షల రూపాయలను భక్తులు ఛానల్‌కి విరాళంగా అందజేశారని సంస్థ వెల్లడించింది.  భవిష్యత్తులో మంచి కార్యక్రమాలను అందించడానికి తాము  ప్రయత్నం చేస్తామని లాభాపేక్ష లేకుండా పని చేస్తామని యాజమాన్యం వెల్లడించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది అని యాజమాన్యం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: