ఒక పక్క కరోనా వైరస్ మందు కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంటే ఇటీవల యోగా గురు బాబా రామ్ దేవ్ తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేసి దాంతో అంతా తగ్గిపోతుంది మనుషులపై ప్రయోగాలు చేసామని మూడు రోజుల నుంచి 7 రోజుల లోపు కరోనా తగ్గింది అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. 

 

ఈ నేపధ్యంలో ఆయనపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు చేసారు. తాజాగా ఆయనకు ఉత్తరాఖండ్ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఆయుర్వేద ఔషధం కరోనిల్‌పై నిషేధం కోరుతూ చేసిన విజ్ఞప్తిపై ఉత్తరాఖండ్ హైకోర్టు యోగా గురువు రామ్‌దేవ్, దివ్య ఫార్మసీ, నిమ్స్ విశ్వవిద్యాలయం, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: