హైదరాబాద్ కోసం ఇప్పుడు పలువురు భారీగా వర్షాలు పడటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రభుత్వం కూడా అండగా నిలబడటానికి ముందుకు వచ్చింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం  తాము కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నామని తెలంగాణా సర్కార్ కు లేఖ పంపారు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్.

కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని అయన స్పష్టం చేసారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: