ఆంధ్రప్రదేశ్ లో బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ పెద్ద ఎత్తున పదవులు ఇవ్వడంతో టీడీపీ కూడా పదవులను ప్రకటించింది. ఇక తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ సామాన్యుడికి రాజకీయం నేర్పింది టిడిపి అని ఆయన అన్నారు. ఎంతో మంది పార్లమెంటు సభ్యులుగా టిడిపి లో పని చేశారు అని గుర్తు చేసారు.

దళితుడిని జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా చేసిన ఘనత టిడిపి ది అని ఆయన అన్నారు. జిల్లా నాయకత్వం వహించనున్న శ్రావణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు అన్నారు. సైబరాబాదు లేకపోతే హైదరాబాద్ ఎడారి అయ్యేది అని అన్నారు. దాతృత్వంతో ఏర్పడిన అమరావతి ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా పోరాటం చేయాలన్నారు ఆలపాటి రాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: