విజయనగరంలో కుటుంబ సమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం... ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు  నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా ఆయన  ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ త్వరగా తగ్గాలని, సాధారణ పరిస్థితులు రావాలని అమ్మవారిని ప్రార్ధించాను అని ఆయన అన్నారు. వైఎస్  రాజశేఖర్ రెడ్డి హయాంలో జల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు అన్నారు.

అప్పట్లో కేంద్రప్రభుత్వం కూడా సహకరించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ లు, సాగునీటి ప్రాజెక్టుల పై దృష్టి పెట్టారని అన్నారు. కేంద్రం సహకరించి సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేని పరిస్థితులలో కేంద్రం అన్నివిధాలా ఆదుకోవాలి అని ఈ సందర్భంగా తమ్మినేని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: