ఆంధ్రప్రదేశ్ లో కేబినేట్ సమావేశం విషయంలో తాజాగా స్పష్టత వచ్చింది. వచ్చే నెల 4 న కేబినేట్ సమావేశం జరుగుతుంది అని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో  అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అదే విధంగా త్వరలో శాసన సభ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.

అదే విధంగా ఏపీలో భవిష్యత్తులో అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నే దాని మీద కూడా  కేబినేట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పలు బిల్లుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: