అధికార విపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీహార్ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నాయి. నేడు బీహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అసలు తీర్పు ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ప్రచారం విషయం లో కూడా అకడి పార్టీలు దూసుకుపోతున్నాయి. నేడు బిహార్ లో పోటాపోటీగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.

మూడు సభలలో పాల్గొననున్న ప్రధాని మోడీ... ఎన్డియేకి ప్రచారం చేస్తారు. రెండు సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మహాకూమికి ప్రచారం చేసారు. వాల్మీకీ నగర్, దర్భాంగా జిల్లాల్లో రాహుల్ గాంధీ ప్రచార సభలు నిర్వహిస్తారు.  పాట్నా, ముజాఫర్‌ పూర్, దర్భంగాలలో ప్రధాని మోడీ సభలలో  పాల్గొని ప్రసంగిస్తారు. దీనితో పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: