దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున అభ్యర్దిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామం లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టి ఆర్ ఎస్ నాయకులు మా నాన్నకి మాయ మాటలు చెప్పి పార్టీలో చేర్చుకొని ఆ తరువాత ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో బాధతో మా నాన్న మరణించారని అన్నారు.

 మా నాన్న మరణానికి కేసీఆర్ హరీష్ లే కారణమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని హరీష్ రావు, రఘునందన్ రావులు ఇద్దరూ డబ్బులతో కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వీరిని నమ్మితే ఏమి రావని సుధాకర్ రెడ్డి అన్నారు. చింతమడక గ్రామంలో ప్రతి ఇంటికి 10 లక్షలు ఇచ్చినట్లు ,దుబ్బాక నియోజకవర్గంలో భూమి లేని నిరుపేదలకి 10 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: