దేశలో ఉల్లిధరలు కొండెక్కిన వేళ నాఫెడ్ చర్యలకు ఉపక్రమించింది. దేశంలో ఉల్లి లభ్యతను పెంచడం సహా.. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఉల్లిని దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగా నవంబర్ 20లోగా 15వేల టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయడానికి దిగుమతిదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది. 40నుంచి 60 ఎంఎం సైజులో ఉన్న ఉల్లిపాయలను కేజీ యాభై చొప్పున సరఫరా చేయాలని నాఫెడ్ కోరుతోంది.


నవంబర్ నాలుగో తేదీకి బిడ్డింగ్ ప్రక్రియ ముగుస్తుందన్న నాఫెడ్... మరుసటి రోజు టెండర్లు తెరుస్తామని వెల్లడించింది. జవహార్​లాల్​ నెహ్రూ, కండ్లా పోర్టుల్లో డెలివరీ ఉంటుందని తెలిపింది.ప్రభుత్వం తరఫున నిర్వహించే ఉల్లి బఫర్​ స్టాక్​ క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో ప్రస్తుత మార్కెట్​ పరిస్థితులకు అనుగుణంగా సరఫరాను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది నాఫెడ్​.

మరింత సమాచారం తెలుసుకోండి: